కన్నడ శతావధాని: తాతాచారి గారు, శ్రీనాథుడిది ఆశు కవిత్వం, పెద్దనది ఆలోచనామృతమని తమరు షూలేసుతో కలిసి వ్రాసి పడేశారు. అంటే, శ్రీనాథుడికి ఆశువుగా పద్యం చెప్పడమేగానీ, ఆలోచన లేదంటారా? లేక పెద్దనకు ధార లేదు, ఆలోచించి ఆగి ఆగి వ్రాస్తాడంటారా పద్యం? రెండూ తప్పే కదూ తాతాచారి గారు? తాతాచారి: హీహీ, నేను ఏమంటే అదే సరి అనే నా శిష్యులున్నారిక్కడ. కన్నడ శతావధాని: శ్రీనాథుడిది, పెద్దనది, తెనాలి రామకృష్ణులది, కృష్ణదేవ రాయలది వేరే వేరే schools అని మాట్లాడారేమి మీరు,మీ షూలేసు? కవి మనోధర్మాన్ని అనుసరించి భిన్నంగా వ్రాసినంత మాత్రాన వారివి వేరే వేరే school of thought ఎలా అవుతుందండీ? తాతాచారి: హీహీ, నేను ఏమంటే అదే సరి అనే నా శిష్యులున్నారిక్కడ. కన్నడ శతావధాని: తమరిద్దరు సృజనకారులు కారే? జన్మలో ఒక పద్యం రాయలేదు, కవిత్వం చెప్పలేదు. కవి కాకుండా, ఒక్క పద్యమూ వ్రాయకుండా, పద్యంలో ఒడుపు తెలియకుండా కవుల పద్యాలను ఏ జ్ఞానంతో బేరీజు వేసి వ్యాఖ్యానాలు చేస్తున్నారయ్యా? తాతాచారి: హీహీ, నేను ఏమంటే అదే సరి అనే నా శిష్యులున్నారిక్కడ. కన్నడ శతావధాని: సంప్రదాయం తెలియకుండా, అ...
నేను ఏ కథ రాసినా అన్నీ తిరగ్గొడుతున్నార్రా సంపాదకులు! అన్నీ మంచి కథలే కానీ ఈ పత్రికల వాళ్ళకే నచ్చట్లేదు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. అలాగా. ఏదీ నువ్వు పత్రికలకి పంపిన కథల్లో ఒక కథ చెప్పు? ఆమధ్య ఒక కథ రాసి బ్రాందీ జ్యోతికి పంపా. టూకీగా చెప్తా విను. అనగనగా ఓ గుడి పూజారి. అర్చకత్వం చేసేవారికి ఈమధ్య పిల్ల దొరకడం కష్టంగా ఉంది కనుక అతనికి ఎన్నాళ్ళైనా పెళ్ళి కాలేదు. అతని తల్లి చనిపోతూ, చనిపోతూ ఎప్పటికైనా నీకు పెళ్ళైతే నా కోడలికి ఈ నగలు పెట్టు అని చెప్పి కన్ను మూసింది. ఆ తరువాత కాలం గడిచి అతను నలభై దాటినా అవివాహితుడుగానే ఉండిపోయాడు. చివరకు ఇక తనకు పెళ్ళి కాదని నిర్ణయించుకొని ఆ నగలను భద్రాచలం రామయ్యకు, సీతమ్మకు సమర్పిద్దామని రైల్లో బయల్దేరాడు. దారిలో తాను చూసిన సాటి ప్రయాణీకుల మాటలు అవీ అతన్ని ప్రభావితం చేస్తాయి. తనను పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకి మళ్ళించడానికే ఆ భగవంతుడు తనకు వివాహం అనే ఉచ్చు తగిలించి సంసార సాగరంలోకి తోసివేయకుండా కాపాడాడన్న నిశ్చయానికి వచ్చి, భద్రాచలం చేరుకుని తన తల్లి ఇచ్చిన నగలను రామయ్యకు,సీతమ్మకు సమర్పించి, అటునించి అటే సన్యాస దీక్ష తీసుకోవడా...
వచన కవి సుబ్బారావు కాలంలో అలా అలా వెనక్కి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్ళిపడ్డాడు. అక్కడో అందమైన దేవదాసీ పూలసజ్జ చేత పుచ్చుకుని దేవళానికి పోతూ కనిపించింది. వెంటనే- నీ కళ్ళు నీ కళ్ళు నా వలపు వాకిళ్ళు చెక్కిళ్ళు చెక్కిళ్ళు కోర్కెలకు ఎక్కిళ్ళు నీ ఒళ్ళు నా ఒళ్ళు ప్రేమలకు పరవళ్ళు అంటూ ఓ కవితను ఆశువుగా చెప్పేశాడు. పద్యం కట్టడం రాదా స్వామీ? అని ఎకసెక్కెమాడింది ఆ దేవదాసి. ఆ మాటకు సిగ్గు పడిపోయాడు సుబ్బారావు. వన్నెల నెరజాణలు మీ చిన్నెలు పదివేలవి చిలువలు పలువలు ఈ మోహము నాకేల హా! ఇచ్చకపు మాటలు పోయి వచ్చెద మరి ఇంతి, నా దారి నాది. అంటూ అక్కడినించి కదిలాడు. అలా విజయ నగర వైభవం చూస్తూ ఆ వీథులను, ఆ దేవాలయాలను, ఆ మేడలను, ఆ సైనికులను ఆ వైభవాన్ని చూస్తూ చూస్తూ కవిని అని ద్వారపాలకులకు చెప్పుకుని రాయలవారి ఆస్థానంలోకి ప్రవేశించాడు. సింహాసనం మీద కూర్చున్న రాయలవారిని చూడగానే, సుబ్బారావులోని కవి ఉవ్వెత్తున పైకిలేచి, అటు చూడు ఇటు చూడు ఆకాశ హర్మ్యాలు జేగీయమానాలు రాయల దేశమిది రత్న గర్భ! ఎదురు లేని దిగ్విజయ నగరమిది సాహో! గజపతులు సురపతులు నీ కా...