కవిత్వం-కవి
మనసును నిశ్చలంగా ఉంచు,భావోద్వేగాలకు అతీతంగా అని చెబుతుంది యోగశాస్త్రం. భావోద్వేగాలే కవిత్వాన్ని పుట్టిస్తాయి కానీ, అవి చల్లారి మనసు నిశ్చలమయ్యాకే కవిత్వం పుడుతుంది ఏ కవికైనా.
మరీ కిందికి వెళ్ళిపోకు
పెను దుఃఖపు పాకంలోకి
మరీ పైపైకి తేలిపోకు
అమందానందపు ఆవిరిలోకి
రెంటికీ మధ్యలో
సన్న గీత ఉందే,
సరిగ్గా అదిగో
అక్కడే ఉండు.
కవిత్వం హల్వాలా
ఉడుకుతూ ఉంటుందక్కడ
కుతకుతలాడుతూ
రెప్పలు వేస్తూ.